Others

బోధించేది నేర్చుకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరగతి గది జ్ఞానం గురుశిష్యుల సంబంధాలపైనే ఆధారపడి ఉంటుంది. జ్ఞానమనేది వౌలిక సౌకర్యాల కల్పన వల్ల రాదు. అది మనిషి మెదడులోని ఆలోచనల పరంపర నుంచి రావాల్సిందే. నిరంతరం ఉపాధ్యాయుల జ్ఞానాన్ని పెంచే పద్ధతులే తరగతి గది ప్రమాణానికి మూలమవుతున్నాయి. దీన్ని గతంలో ‘టీచర్ ఎడ్యుకేషన్’ అనేవారు. కానీ, ఇపుడు దాన్ని ‘ఎడ్యుకేషన్ ఆఫ్ టీచర్స్’ అంటున్నారు. జ్ఞానాన్ని ఏ విధంగా బోధిస్తే విద్యార్థి నేర్చుకుంటాటో ఉపాధ్యాయుడు ఆ మార్గాన్ని అవలంబిస్తాడు. దీనే్న ‘టీచింగ్ ఆఫ్ సైన్స్’ అంటారు. ఉపాధ్యాయులను ఉద్యోగులుగా పరిగణించకూడదు. వారిని నైపుణ్యదారులుగా భావించాలి. బోధన ఒక ప్రొఫెషనలిజంగా నిపుణతతో జరగాలి. విద్యలో ఏ సంస్కరణలొచ్చినా వసతులు, భవనాలు నిర్మించటం, ఉపాధ్యాయుల, సిబ్బంది జీతాలు పెంచడం జరుగుతుంది కాని టీచింగ్‌లో సంస్కరణలు జరగటం లేదు. టీచింగ్‌లో వృత్తి నైపుణ్యత పెరగాలి. విద్యార్థులకు ఏ విధంగా బోధిస్తే నేర్చుకుంటారో అని ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించాలి. ఉపాధ్యాయుల మధ్య చర్చ జరుగుతుండాలి. అందుకే మా సీనియర్ మ్యాథ్స్ టీచర్ తెలిదేవర వెంకట్రావు- ‘ఇవాళ ఏం చదువు చెప్పినావు?’ అని స్ట్ఫారూమ్‌కు వెళ్లగానే అడిగేవారు.
‘పుస్తకంలో వున్న క్రమంలోనే బోధన చేశాన’ని చెప్పాను.
‘పుస్తకంలో పాఠ్యాంశం అన్నది రచయిత క్రమం కావచ్చును. ఆ రచయిత క్రమాన్ని మాత్రమే ఎలా చెప్పావని?’ తెలిదేవర ఎదురుప్రశ్న వేశారు. ఆయన వేసిన ప్రశ్నతో నేను కాస్త చికాకుపడేవాణ్ణి.
‘పుస్తకంలో వున్నట్టే చెబితే నువ్వెందుకయ్యా?’ అని తెలిదేవర నాతో అనేవారు.
‘మరి ఎట్లా చెప్పాలో చెప్పండి. మీరు అనుభవజ్ఞులు కదా’ అని నేను కొత్త ఉపాధ్యాయునిలా అమాయకంగా అడిగాను.
ఆయన ఈసారి కోపంగా మాట్లాడారు. ‘నీ భార్యతో నువ్వెలా మాట్లాడాలో నేను చెబుతానా? సమయస్ఫూర్తిగా ఎదుటివారి మానసిక స్థితి, నేపథ్యాన్ని బట్టి బోధించాలే కానీ, తరగతి బైట వున్న నన్ను అడిగితే ఏం చెప్పగలను?’ అని బోధనా తాత్త్వికతతో ఆయన మాట్లాడారు. అందుకే ఇప్పటి కాలంలో బోధనను ‘ఎడ్యుకేషన్ ఆఫ్ టీచర్’ అంటున్నారు. ఆ బోధనను తరగతి గదే నేర్పుతుంది. పిల్లలు సమష్టిగా నేర్పుతారు. తరగతి గది సామూహిక ప్రక్రియ. మొత్తంగా బోధన ఎలా చేయాలో పిల్లల ద్వారా తరగతి గదే నేర్పుతుంది. మొదటి వాక్యం చెప్పినపుడు తెల్లమొఖాలు వేసే ఆ పిల్లలకు ఎలా బోధించాలో టీచర్ అయినవారికే అర్థమవుతుంది. అందుకే బోధన చేసే ఉపాధ్యాయుడు దీక్ష కలిగి ఉండాలి.
చెప్పిన పాఠం పిల్లలకు అర్థమైందో లేదో ఉపాధ్యాయుడు గుర్తించలేడా? పిల్లలకు పాఠం అర్థం కాకపోతే ఆ రోజు ఉపాధ్యాయుడు నిద్రపోతాడా? ఆ రోజు ఆసాంతం ఆ ఉపాధ్యాయుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రకంగా ఆలోచించటానే్న ‘ఎడ్యుకేషన్ ఆఫ్ టీచర్స్’ అంటారు. ఇది బాహ్యశక్తులతో వచ్చేది కాదు. అదే ఉపాధ్యాయులకు బోధనా శక్తిని కల్పిస్తుంది. ఉపాధ్యాయులుగా ఉన్నవారు రాజకీయాల గురించి, ఇతర విషయాల గురించి ఆలోచించకుండా ‘ఈ పాఠం పిల్లలకు ఎలా బోధించాలో ఆలోచించ’మని తెలిదేవర వెంకట్రావు నాకు బోధనా పాఠం చెప్పారు.
‘పిల్లలను ప్రేమించగలిగినపుడే బోధన వస్తుంది’ అని తెలిదేవర నన్ను వెన్నుతట్టి వెళ్లిపోయారు.

-చుక్కా రామయ్య