రాష్ట్రీయం

రామ్‌నాథ్‌ను బలపరుస్తూ టిఆర్‌ఎస్ సంతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 21: ఏన్డీయే రాష్టప్రతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్‌ను బలపరుస్తూ టిఆర్‌ఎస్ పార్టీ తరపున నామినేషన్ పత్రాలపై టిఆర్‌ఎస్ లోక్‌సభ పక్షనేత జితేందర్‌రెడ్డి బుధవారం సంతకం చేశారు. రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు తెలుపుతూ చేసిన సంతకాలు వరుస క్రమంలో తొలి సంతకం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాగా, రెండో సంతకం తమ పార్టీదేనని చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించిన విధంగానే దళిత వ్యక్తిని రాష్టప్రతి పదవికి ఎంపిక చేశారని ఆయన వెల్లడించారు. ఎన్డీయే రాష్టప్రతి అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు కెసిఆర్ ఢిల్లీలో పర్యటించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. జిఎస్టీ అమలుకోసం ఈ నెల 30 రాత్రి పార్లమెంట్‌లో జరిగే కార్యక్రమంలో సిఎం కెసిఆర్ కూడా పాల్గొంటారని చెప్పారు.