ప్రకాశం

లారీప్రమాదంలో గుర్తు తెలియని యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేదరమెట్ల,జూన్ 26 : ప్రమాదంలో గుర్తుతెలియని యువకుడు మృతి చెందిన సంఘటన మేదరమెట్ల-నార్కెట్‌పల్లి రహదారిపై కొరిశపాడు మండల బొడ్డువారిపాలెం గ్రామపరిధిలో సోమవారం వేకువజామున జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఢిల్లీ సమీపంలోని గురుగావ్ ప్రాంతానికి చెందిన ఐషర్ గూడ్స్ వాహనం చెన్నై వెళ్తూ బొడ్డువానిపాలెం కొండసమీపంలో సోమవారం వేకుమజామున ఐదుగంటల ప్రాంతంలో ముందువెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టింది. ఈప్రమాదంలో క్లీనర్ స్దానంలో కూర్చోని ఉన్న గుర్తుతెలియని యువకుడు (20) క్యాబిన్ ఇరుక్కుని తీవ్ర గాయాలు పాలై మృతిచెందాడు.ప్రమాదం జరిగిన వెంటనే లారీని ప్రమాదస్ధలంలోనే డ్రైవర్ వదలి పరారు కావటంతో వాహనం పూర్తివివరాలు, మృతిచెందిన పూర్తివివరాలు పోలీసులకు సాయంత్రం వరకు అందలేదు. ప్రమాదవార్తను తెలుసుకున్న ఎస్‌ఐ పాండురంగారావు ఘటన స్ధలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి డ్రైవరు ఆచూకి కోసం మృతుని వివరాలకోసం ఆరా తీస్తున్నారు.