శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు
లారీ ఢీకొని ముగ్గురు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
చిల్లకూరు, జూన్ 26: మండలంలోని చింతవరం పంచాయతీలో గల కొత్తపాళెం సమీపంలో రోడ్డు మలుపు వద్ద స్కూటర్పై వెళుతున్న ముగ్గురిని లారీ ఢీకొనడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓజిలి మండలం గెద్దగుంట గ్రామానికి చెందిన నిరుపమ (25), తమ కుమారుడు మునికిరణ్ (5)తో కలిసి ఆర్టిసి బస్సులో చింతవరం గ్రామానికి చేరుకుంది. చింతవరం నుండి శ్రీకాళహస్తికి చెందిన మాధవ్ అనే వ్యక్తి సిలికా మైన్స్ వద్దకు వెళుతుండగా ఆ మహిళ అతడిని ఆపి చింతవరం కొత్తపాళెం వద్ద తనను వదిలిపెట్టమని కోరింది. దీంతో స్కూటర్పై ఆమెను ఎక్కించుకొని వెళ్లే క్రమంలో మలుపు వద్ద సిలికా లారీ ఢీకొనడంతో మాధవ్తోపాటు స్కూటర్పై వెళుతున్న నిరుపమ, మునికిరణ్లు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి సంఘటన జరిగిన తీరుతెన్నులపై ఆరాతీసి మృతదేహాలను గూడూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈమేరకు ఎస్ఐ అంకమ్మ కేసు నమోదు చేసి మృతుల బంధువులకు సమాచారం అందించారు.