బిజినెస్

పెరిగిన గోల్డ్ బాండ్ పెట్టుబడుల పరిమితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 26: సావరిన్ గోల్డ్ బాండ్స్ (ఎస్‌జిబి)లో వార్షిక పెట్టుబడుల పరిమితిని ఒక్కొక్కరికి 500 గ్రాముల నుంచి 4 కిలోలకు పెంచుతూ కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. అంతేగాక కొనుగోలుదారులు, మదుపరులను ఆకర్షించేందుకు ఎస్‌జిబిని మరింత సరళతరం చేసింది. కాగా, ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత పెట్టుబడుల పరిమితిని 4 కిలోలకు పెంచిన ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు.. హిందూ అవిభాజ్య కుటుంబాని (హెచ్‌యుఎఫ్)కి కూడా ఈ పరిమితిని 4 కిలోలుగానే నిర్ణయించింది. ట్రస్టులు, సంస్థల పెట్టుబడుల పరిమితిని 20 కిలోలుగా స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం ఓ అధికారిక ప్రకటన విడుదలైంది.