రంగారెడ్డి

ఘనంగా బహుజన మహావీరుడు సర్దార్ పాపన్న గౌడ్ జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్: షాద్‌నగర్ పట్టణంలో కల్లుగీతా కార్మిక సంఘం ఆధ్వర్యంలో బహుజన మహావీరుడు సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. షాద్‌నగర్ ముఖ్యకూడలిలో పాపన్న చిత్రపటానికి స్థానిక శాసనసభ్యుడు ఎల్గనమోని అంజయ్య యాదవ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌడ కులస్థుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. షాద్‌నగర్‌లో నూతనంగా గౌడ సంఘం భవన నిర్మాణానికి 25లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని వివరించారు. ప్రొసిడింగ్ ఉత్తర్వుల కాఫీని సంఘం నాయకులకు ఎమ్మెల్యే అందజేశారు. కులవృత్తులను పటిష్టం చేయాలనే సంకల్పంతోనే ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు వర్తించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు రంగయ్య గౌడ్, వన్నాడ ప్రకాష్ గౌడ్, అశోక్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మల్లేష్ గౌడ్, రోళ్ల అంజయ్యగౌడ్, , నీల రవీందర్‌గౌడ్, రజినికాంత్ గౌడ్, కట్టా వెంకటేష్ గౌడ్, రాములు గౌడ్, వన్నాడ వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు.
కేశంపేట: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం కేశంపేట మండల కేంద్రంతోపాటు కొత్తపేట గ్రామంలో పాపన్నగౌడ్ 367వ జయంతి వేడుకల సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు కుమార్ గౌడ్, యాదయ్య గౌడ్, రమేష్ గౌడ్, అంజయ్య గౌడ్, సురేష్ గౌడ్, నర్సింలు గౌడ్, ఉదయ్ గౌడ్, బాలయ్య గౌడ్, మల్లేష్ గౌడ్, అశోక్‌గౌడ్, మనోహార్ గౌడ్, నరేంద్రగౌడ్, మహేష్ గౌడ్, గణేష్ గౌడ్, శ్రీనుగౌడ్, సతీష్ గౌడ్, రఘు గౌడ్ పాల్గొన్నారు.
కొందుర్గు: కొందుర్గులో పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం కొందుర్గు, జిల్లెడ్‌చౌదరిగూడ మండలాల్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో వైస్ ఎంపిపి చంద్రబాబు గౌడ్, గౌడ సంఘం నాయకులు రామకృష్ణ గౌడ్, రాజేందర్‌గౌడ్, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్, శివశంకర్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు.
కొత్తూరు: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొత్తూరు ముఖ్య కూడలిలో పాపన్నగౌడ్ చిత్రపటానికి ఎంపిపి శివశంకర్ గౌడ్ పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుదర్శన్ గౌడ్, ఎంపిటిసి కృష్ణగౌడ్, గోవర్ధన్ గౌడ్, మహేష్ గౌడ్, నర్సింలు గౌడ్, ఆంజనేయులు గౌడ్, గణేష్ గౌడ్, దేవేందర్ గౌడ్ పాల్గొన్నారు.