ఇక.. ఒక్కడే మిగిలాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచు మనోజ్ కథానాయకుడిగా పద్మజ ఫిలింస్ ఇండియా ప్రై. లి. పతాకంపై ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘ఒక్కడే మిగిలాడు’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను శనివారం ఉదయం హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- మనింటికి వచ్చినవారు దౌర్జన్యం చేస్తే మనమెలా ప్రతిస్పందిస్తాం అన్న ఓ ఉద్వేగభరితమైన కథనం తీసుకుని ఈ చిత్రం రూపొందించామని తెలిపారు. ఒక దేశం ఒక రాష్ట్రం కుటుంబంలో పెద్ద ఫెయిలైతే దాని ప్రభావం సమాజంమీద, కుటుంబంపై ఎలా ప్రభావం చూపుతుంది అనేదే ఈ చిత్రంలో ప్రధాన కథనమని అన్నారు. ఈ శతాబ్దంలో మనిషి ఆకలికోసం మనుగడకోసం పోరాడుతున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించామని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వచ్చేనెల 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ఈ చిత్రంలో తాను రెండు పాత్రలు చేయగలనని నమ్మి నాతో సినిమా రూపొందించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలని నటుడు మనోజ్ అన్నారు. కార్యక్రమంలో లక్ష్మీ ప్రసన్న, శివా నందిగామ తదితరులు పాల్గొన్నారు. అనీషా ఆంబ్రోస్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో మిలింద్ గుణాజీ, సుహాసిని, సూర్య, బెనర్జీ, జెన్నీఫర్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.