కృష్ణ

జ్వరంతో పాములలంక మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు: మండలంలోని పాములలంకలో జ్వరం సోకిన పాముల నాగరత్నం(56) శనివారం సాయంత్రం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మృతిచెందింది. సాయంత్రం 6 గంటల సమయంలో మృతి చెందటంతో గ్రామంలోని బంధువులకు సమాచారం అందించారు. దీంతో పాములలంక నుంచి బంధువులు విజయవాడ బయలుదేరారు. నాగరత్నం ఈ నెల 15 నుంచి అస్వస్థతతో ఉంది. 16వ తేదిన దగ్గు, జలుబు, జ్వరంతో పాములలంక ఆరోగ్య ఉప కేంద్రానికి వచ్చిందని వైద్య సిబ్బంది తెలిపారు. జ్వరం 96 ఉందని, మందులు తీసుకువెళ్ళిందని తెలిపారు. అయినా తగ్గకపోవటంతోఒక ఆర్‌ఎంపి వద్ద చికిత్స పొందినట్టు గ్రామస్తులు చెపుతున్నారు. ఆర్‌ఎంపి నుంచి శుక్రవారం ఉయ్యూరు ఆస్పత్రికి వెళ్ళగా అక్కడ నుంచి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విజయవాడలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. నాగరత్నంకు ప్లేట్‌లెట్స్ పడిపోయి మృతిచెందిందని సర్పంచ్ పాముల శ్రీనివాసరావు చెప్పారు. నాగరత్నం మృతి గ్రామంలో కలకలం కలిగిస్తోంది. ఊరంతా జ్వరాలు, బాడీ పెయిన్స్ బాధపడుతున్న విషయం తెలిసిందే.