శ్రీకాకుళం

‘కొవ్వాడలో అణుపార్కు వద్దే వద్దు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రణస్థలం: కొవ్వాడ ప్రాంతంలో అణువిద్యుత్ పార్కు ఎట్టి పరిస్థితిలోనూ ఏర్పాటు చేయవద్దని సిటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.గోవిందరావు పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఆదివారం సిటు కార్యాయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల ప్రాంతాల్లో ఇటీవల కాలంలో భూప్రకంపనలు పెరిగినందున అణుపార్కు ఏర్పాటు చేయడం తగదన్నారు. ప్రధానంగా అమెరికాలో దివాళా పిటీషన్ వేసిన వెస్టింగ్ హౌస్ సంస్థకు అణు రియాక్టర్ల నిర్మాణం ఎలా ఇస్తారన్నారు. సిటు నాయకులు తేజేశ్వరరావు, అమ్మన్నాయుడులు మాట్లాడుతూ ఎంతో లోపభూయిష్టమన్న అణుపార్కుకు వ్యతరేకంగా అన్ని గ్రామాల్లో ప్రజలు పోరాటం చేయాలని కోరారు. ఇందుకోసం గ్రామాల్లో తిరిగి మరలా పోరాటం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.