నెల్లూరు

చెరపకురా చెడేవు..! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహపురిలో వీర్రాజు అతని భార్య ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ తనకున్న మామిడి, అరటితోటలు చూసుకుంటూ వచ్చిన దానితో హాయిగా జీవితం సాగించేవాడు. ఒకరోజు వీర్రాజు స్నేహితుడు పరంధామయ్య ఇంటికొచ్చి కుశలప్రశ్నల అనంతరం పరంధామయ్య ‘‘ఎప్పుడు ఈ పొలం పనులు చేసుకుంటూ, కష్టపడుతూ ఎంతకాలం పల్లెలో ఉంటావు. నాతో చేయి కలుపు నీకు ఏ కష్టం లేని బతుకు, కావలసినంత డబ్బు వచ్చే వ్యాపారం నేను చూపిస్తాను అన్నాడు’’. వీర్రాజు అందుకు ‘‘నా ఊరు, పొలం, ఇల్లు, పిల్లలు వదిలిరావడం కుదరడు’’ అన్నాడు. పరంధామయ్య ఆ మాట ఈ మాట చెప్పి వీర్రాజుని అతని భార్యని ఒప్పించి వస్తానని, బాగా ఆలోచించుకోమని ఏ విషయం త్వరలో చెప్పమని చెప్పగా ఒక నెల సమయం తీసుకొని చెప్తానన్నాడు. ‘‘సరే’’ అని ఊరికి బయలుదేరిపోయాడు పరంధామయ్య.
పరంధామయ్య చెప్పిన మాటలు వీర్రాజు, అతని భార్యపైన బాగా పనిచేశాయి. ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చి పొలాన్ని అమ్మి వీర్రాజు ఆ డబ్బుతో పరంధామయ్య ఇల్లు చేరాడు. ఇద్దరు భోజనాలు అయ్యాక పరంధామయ్య ‘‘ఈ ఊరి చివర మన ఇల్లు ఒకటి వుంది. దానిలో మన వ్యాపారం ప్రారంభిస్తాం. నీవు కుర్చీలో కూర్చుని అక్కడ పనిచేసే వాళ్లని గమనిస్తుంటే చాలు నీ నెల జీతం నీ దగ్గరకి వస్తుంది. రేపు టౌన్‌లోకి పోయి కావలసినంత సరుకు, కొన్ని యంత్రాల్ని తీసుకొస్తాను. మన కోసం పనిచేసేదానికి నమ్మకమైన మనుషులు చాలామంది ఉన్నారు’’ అని వీర్రాజుతో అన్నాడు.
పరంధామయ్య ఊరి చివర ఉన్న ఇంటికి వ్యాపారానికి సరిపడ అన్ని హంగులు సమకూర్చాడు. ఒక మంచిరోజు చూసి వ్యాపారం ప్రారంభించాడు. పనివాళ్లు బస్తాల్లో పొడులు తీసి యంత్రాలతో వేసి కలుపుతూ బాక్సుల్లో, డబ్బాల్లో నింపి సీలు చేస్తున్నారు. కుర్చీలో కూర్చుని వీర్రాజు వాళ్లు చేసే పని చేసుకుంటు కాలం గడుపుతున్నాడు. వీర్రాజుకి నెలనెలా డబ్బు బాగా ముట్టుతోంది. రోజులు గడుస్తున్నాయి.
ఒకరోజు పట్నంలో చదువుతున్న తన ఒక్కగానొక్క కొడుకు ఆసుపత్రిలో ఉన్నట్లు త్వరగా బయలుదేరి రావాలని పరంధామయ్యకు ఫోను వచ్చింది. గుండె ఆగినంత పని అయిన పరంధామయ్య పరుగుపరుగున వీర్రాజు వద్దకు వచ్చి విషయం చెప్పి పట్నం పోతున్నానని.. వచ్చి అన్ని వివరంగా చెప్తానని బయలుదేరి వెళ్లిపోయాడు. ఆసుపత్రి చేరేసరికి అక్కడి దృశ్యం చూసి అవాక్కయ్యాడు. ఐసియులో కొడుకు, డాక్టర్లు, నర్సులు ఉన్నారు. బయట పోలీసులు నిల్చుని వున్నారు. ఇంతలో డాక్టర్ బయటికి వచ్చాడు. ఒక నర్సు అక్కడికి వచ్చి ఇతనే అబ్బాయి తండ్రి అని పరిచయం చేసింది. డాక్టర్, ఇన్స్‌పెక్టర్ అతన్ని డాక్టర్ గదికి తీసుకెళ్లి అతని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ‘‘మీ పిల్లవాడు ఆరోగ్యం బాగా దెబ్బతినింది. కల్తీ ఆహారం, రోజూ హోటల్లో తినడం వల్ల లివర్, మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. కోలుకోవడం కష్టం మీరెంత డబ్బు ఖర్చుపెట్టినా బతుకుతాడని నమ్మకం లేదు’’ అన్నాడు డాక్టర్. ‘‘ ఎలాగైనా నా బిడ్డని బ్రతికించండి.. డబ్బు తెస్తాను’’ అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు పరంధామయ్య.
ఇంటికి వెళ్లేసరికి పరంధామయ్య భార్య లబోదిబోమంటూ ఏడుస్తూ ‘‘మనం వ్యాపారం చేస్తున్న గోదాముని ప్రభుత్వ అధికారులు తాళాలు వేసి కల్తీ వ్యాపారం చేస్తున్నారని, మిమ్మల్ని ఇంటికి వస్తూనే పోలీసుస్టేషన్‌కు రమ్మని చెప్పి వెళ్లారండీ’’ అని చెప్పింది. అసలే కొడుకు గురించి బాధ పడుతున్న అతనికి మూలిగే నక్క మీద తాటికాయపడిన పరిస్థితి అయ్యింది. భార్యతో కొడుకు విషయం చెప్పగానే కూప్పకూలింది. ఆమెని ఆసుపత్రిలో చేర్చి బంధువులను చూసుకోమని పోలీసుస్టేషన్‌కి వెళ్లాడు. పోలీసులు మీరు చేసే కల్తీ వ్యాపారం వల్ల ఎంతోమంది అనారోగ్యంతో మృత్యువాతపడ్డారు.
పట్నంలోని హోటళ్లకు, మెస్సులకు మీరు చేరవేస్తున్న కల్తీ సరుకుల వల్ల మీ అబ్బాయి కూడా అవి తిని అనారోగ్యంపాలై చనిపోయినట్లు కొద్దిసేపటి క్రితమే వార్త అందింది అని చెప్పారు. అప్పటికే పోలీసులు అరెస్టు చేసిన వీర్రాజుని విచారణ జరపడం పూర్తిచేశారు. కొడుక్కి పోస్టుమార్టం నిర్వహించి పరంధామయ్య చేత అంత్యక్రియలు జరిపించి అనంతరం అతన్ని జైల్లో పెట్టారు. కోర్టు విచారణలో వీర్రాజుకి కొద్దిపాటి జరిమానా విధించి, పరంధామయ్యకు యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. పరంధామయ్య భార్య దిగులుతో మంచంపట్టింది. వీర్రాజు తంటాలుపడి జరిమానా కోర్టువారికి చెల్లించి బయటపడ్డాడు. వీర్రాజు భార్య దురాశ దుఃఖానికి చేటు అని తెలుసుకుంది. పరంధామయ్య చెరపకురా చెడేవు అనుకుంటూ జైల్లో కుమిలిపోసాగాడు.

- కంచనపల్లి ద్వారకానాథ్ చరవాణి : 9985295605