15న వీడెవడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సచిన్, ఇషాగుప్తా హీరో హీరోయిన్లుగా వైకింగ్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తాతినేని సత్య దర్శకత్వంలో రైనా జోషి నిర్మించిన చిత్రం ‘వీడెవడు’. సెప్టెంబర్ 15న సినిమా విడుదల చేస్తున్నారు. థియేట్రికల్ ట్రైలర్‌ను శనివారం ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు తాతినేని సత్య మాట్లాడుతూ ఎస్‌ఎంఎస్, భీమిలి కబడ్డీ జట్టు, శంకర సినిమాల తర్వాత చేసిన మూవీ ఇది. నేను తెలుగులో చేసిన స్ట్రెయిట్ మూవీ వీడెవడు. ఈ చిత్రంలో హీరో సచిన్ జోషి నటనలో కొత్త యాంగిల్ చూస్తారు. బినేంద్ర మీనన్ సినిమాటోగ్రఫీ, తమన్ సంగీతం, రఘు కులకర్ణి ఆర్ట్ సహా సాంకేతిక వర్గం ఎంతో సహకరించింది. సినిమాపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. సినిమాను సెప్టెంబర్ 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. సచిన్ జోషి మాట్లాడుతూ వీడెవడు సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది. సినిమా కోసం పనిచేసిన వారంతా ప్యాషన్‌తో వర్క్ చేశారు. సినిమా కూడా అందరికీ నచ్చేలా వచ్చింది. నిజంగా ఇదో కొత్త తరహా మూవీ. ప్రేక్షకులు కోరుకునే ఎలిమెంట్స్ అన్నీ సినిమాలో ఉంటాయి. ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారని నమ్మకంగా ఉన్నాం అన్నారు. సచిన్, ఇషాగుప్తా, ప్రభు, కిషోర్, సుప్రీత్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెనె్నల కిషోర్, హర్షవర్థన్, ధన్య బాలకృష్ణన్ తదితరులు వివిధ పాత్రల్లో నటించారు.