ఆంధ్రప్రదేశ్‌

పంచాయతీరాజ్‌కు ఐదు స్కోచ్ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 20: రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖకు ఐదు స్కోచ్ అవార్డులు లభించాయి. టెక్నాలజీ విభాగంలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డ్యాష్ బోర్డుకు, బ్లూ ఎకానమీ కేటగిరీలో జలవాణి కాల్ సెంటర్‌కు, మొబిలిటీ క్యాటగిరిలో ఐఓటీ ద్వారా ఎల్‌ఈడీ లైట్ల పర్యవేక్షణకు, బ్లూ ఎకానమీ విభాగంలో ఎన్టీఆర్ జలసిరికి అవార్డులు లభించాయి. ఢిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో పంచాయితీరాజ్ శాఖ కమిషనర్ రామాంజనేయులు అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా శాఖ సిబ్బందిని మంత్రి లోకేష్ అభినందించారు.

ఉత్తమ టీచర్లా.. దరఖాస్తు చేసుకోండి

విజయవాడ, డిసెంబర్ 20: సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సర్వశిక్షా అభియాన్, పాఠశాల విద్యాశాఖ ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను సత్కరించనుంది. ఇందుకోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు పంపాలని సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది. అభ్యర్థులు దరఖాస్తులను సంబంధిత అధికారుల ద్వారా జిల్లాలోని సర్వశిక్ష అభియాన్ కార్యాలయాల్లో అందజేయాలని, దరఖాస్తులను ఈ నెల 27 వరకు స్వీకరిస్తారని తెలిపారు.