తెలంగాణ

సివిల్ వార్ తెచ్చేందుకు హిందుత్వ శక్తుల కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 26: దేశంలో సివిల్ వార్ తీసుకుని వచ్చేందుకు హిందు త్వ శక్తులు కుట్ర చేస్తున్నాయని సిపిఐ జాతీ య ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు. సిపిఐ తెలంగాణ సమితి అధ్వర్యంలో మంగళవారం పార్టీ 92వ ఆవిర్భావ వార్షికోత్సవాలను పురస్కరించుకుని బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభకు ముఖ్యఅతిథిగా హాజరైన సురవరం సుధాకర్ రెడ్డి ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి మొదలుకుని ఎబివిపి కార్యకర్త వరకూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఫాసిస్టుల కంటే నీచమైన రాజకీయాలు బిజెపి చేస్తున్నదని ఆయన ధ్వజమెత్తారు. హిట్లర్, ఫాసిస్టు విధానాలను దేశంలో ప్రధాని మోదీ అమలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. సంఘ్‌పరివార్ నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి లౌకిక, వామపక్ష, ప్రగతిశీల, ప్రజాతంత్ర శక్తులు సంఘటితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సంగ్రామంలో, తెలంగాణ సాయుధ పోరాటంలో పార్టీ నిర్వహించిన పాత్ర అమోఘమైందన్నారు. మణిపూర్ సాయుధ పోరాటాల్లో సిపిఐ అగ్రభాగాన నిలిచిందని, ఫ్యూడల్ సంస్థానాల కుట్రలను ఎదుర్కొని భారత్ యూనియన్‌లో విలీనం చేయడానికి ఎంతో పోరాటం చేయడం జరిగిందని ఆయన తెలిపారు. గోరక్షక దళాల పేరిట బలహీనవర్గాలపై, మైనారిటీలపై, ఎస్‌సిలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
సంఘ్‌పరివార్, హిందుత్వ శక్తులు నరేంద్ర మోదీని అధికారంలోకి తెచ్చాయని సురవరం అన్నారు. సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు మల్లెపల్లి ఆదిరెడ్డి, పార్టీ సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, ఎఐటియుసి జాతీయ కార్యదర్శి బివి విజయలక్ష్మి, హైదరాబాద్ నగర సమితి కార్యదర్శి ఇటి నరసింహ తదితరులు పాల్గొన్నారు.