క్రీడాభూమి

విందుల్లో క్రికెటర్లు బిజీబిజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 27: భారత క్రికెటర్లు విందుల్లో తీరికలేకుండా ఉన్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు ముంబయిలో ఇచ్చిన విందుకు చాలా మంది క్రికెటర్లు హాజరయ్యారు. భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య సోదరుడు, ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ కృణాల్ పాండ్య మెహిందీ కూడా అట్టహాసంగా జరిగింది. తన చిన్ననాటి స్నేహితురాలు పంఖురీ శర్మతో కృణాల్ వివాహం మరో అట్రాక్షన్‌గా మారింది. ఈ ఏడాది వివాహం చేసుకున్న వారిలో జహీర్ ఖాన్, భువనేశ్వర్ కుమార్ కూడా ఉన్నారు. మొత్తం మీద ఎక్కువ మంది క్రికెటర్లు ఈ ఏడాదే ఓ ఇంటివారు కావడం విశేషం.