విశాఖ

మోదమ్మ జాతరకు సీఎం.కు ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, మార్చి 16: రాష్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబును పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవ కమిటి సభ్యులు శుక్రవారం కలిసి అమ్మవారి జాతరకు ఆహ్వానించారు. పాడేరు శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి నేతృత్వంలోని ఉత్సవ కమిటి అధ్యక్షుడు బూరెడ్డి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శులు వెయ్యాకుల సత్యనారాయణ, బిమలపూజారి ఈశ్వరరావు తదితరులు వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి అమ్మవారి జాతర విషిష్ణతను వివరించారు. మే నెల 6 నుంచి 8వ తేది వరకు మూడు రోజుల పాటు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నామని, ఈ మూడు రోజులలో ఏదో ఒక రోజు జాతరలో పాల్గొనాలని వారు కోరారు. మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఈ సందర్భంగా చంద్రబాబు ఉత్సవ కమిటి సభ్యులకు సూచించారు. అనంతరం మోదకొండమ్మ చిత్ర పటాన్ని ముఖ్యమంత్రికి బహుకరించి ఉత్సవ నిర్వహణపై ప్రభుత్వ సహాయం కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

పొట్టి శ్రీరాములు జయంతి
పాడేరు, మార్చి 16: పొట్టి శ్రీరాములు 118వ జయంతిని వాసవి క్లబ్ ప్రతినిధులు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అక్షర పబ్లిక్ పాఠశాల ఆవరణలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాలలు వేసి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వాసవిక్లబ్ ప్రతినిధులు ఎస్.శ్రీను, ఎస్.అర్జునరావు, ఎ.వి.సత్యారావు, ఇమిడిశెట్టి రాజేష్, లావణ్య, ఎస్.మణి, ఎస్.లక్ష్మి, వి.సత్యగౌరి, తదితరులు పాల్గొన్నారు.