విశాఖపట్నం

ప్రజల మందుకు వెళతాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 16: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ద్రోహం చేసిందని తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. ఇప్పుడే టీడీపీతో తెగతెంపులు చేసుకున్నాం. త్వరలోనే జనం ముందుకు వెళ్లి, వాస్తవాలు చెపుతామని బీజేపీ శాసనసభ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు చెప్పారు. శుక్రవారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ హోదా వద్దు, ప్యాకేజీయే కావాలని చంద్రబాబు కేంద్రం వద్ద అంగీకరించడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. హోదా కింద రాష్ట్రానికి రావల్సినవన్నీ ఇస్తామని కేంద్రం చెపుతున్నా, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు బీజేపీకి నష్టం తెస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదా కోసం జగన్ దూకుడుగా వెళుతున్నాడని, ఎక్కడ తాము వెనకబడిపోతామోనన్న భయంతో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ తీసుకువచ్చేది తామేనని అన్నారు. పవన్ కళ్యాణ్‌కు వెన్ను దన్నుగా బీజేపీ ఉండి నడిపిస్తోందన్న వాదన ఏమాత్రం నిజం కాదని అన్నారు. బీజేపీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ప్రజల ముందుకు వెళ్లనున్నామని ఆయన చెప్పారు.