కృష్ణ

హోదా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, మార్చి 22: ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దే అనూరాధ అన్నారు. గురువారం స్థానిక బస్ స్టేషన్ సెంటరులో హోదాకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన శిబిరంలో ఆమె పాల్గొని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు. నమ్మక ద్రోహం చేసిన బీజేపీకి ప్రజలు తగిన మూల్యం చెల్లించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త ఉద్యమ స్ఫూర్తితో కేంద్రంపై పోరాడాలన్నారు. ఈ శిబిరానికి మండల పార్టీ అధ్యక్షుడు బచ్చు వెంకట నాధ ప్రసాద్ నాయకత్వం వహించారు.