క్రైమ్/లీగల్

కల్లెడ గ్రామంలో రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల రూరల్: జగిత్యాల మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన గొల్లపల్లి శ్రీనివాస్ (33) అనే రైతు వడదెబ్బతో ఆదివారం మృతి చెందాడు. జగిత్యాల రూరల్ ఎస్సై కిరణ్‌కుమార్ కథనం ప్రకారం కల్లెడ గ్రామానికి చెందిన గొల్లపల్లి శ్రీనివాస్ అనే రైతు తన పొలం పనులకు వెల్లగా వడదెబ్బ సోకి అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయినట్లు తెలిపారు. గమనించిన తోటి రైతులు ఫోన్ ద్వారా అంబులెన్స్‌కు సమాచారం అందించగా జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించిన అనంతరం పరిస్ధితి విషమంగా ఉండడంతో కరీంనగర్ తీసుకెళ్లారని సూచించారు. దీంతో కరీంనగర్‌కు తరలించే లోగానే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య లావణ్య, కొడుకు, కూతురు ఉన్నారు. కాగా మృతుని భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్‌కుమార్ వెల్లడించారు.

వడదెబ్బకు వృద్ధురాలి మృతి
సైదాపూర్, మే 20: మండలంలోని పెర్కపల్లి పంచాయతీ పరిధి గొల్లగూడెంకు చెందిన బత్తుల రాజమ్మ (75) అనే వృద్ధురాలు ఆదివారం వడదెబ్బతో మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం..గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు ఎక్కువకావడంతో ఎండ వేడిమికి తట్టుకోలేక అస్వస్థతకు గురై మృతి చెందినట్లు వారు తెలిపారు. మృతురాలికి నలుగురు కుమారులు ఉన్నారు.
మందు బాబులపై కేసు నమోదు
ముకరంపుర కరీంనగర్, మే 20: మానేరు డ్యాం శివారులోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న ఐదుగురు మందు బాబులను ఆదివారం లేఖ్ పోలీసులు పట్టుకున్నట్లు ఆర్‌ఎస్‌ఐ ఎస్.శ్రీశైలం తెలిపారు. గంగాధర మండలం గట్టుబూత్కూరు గ్రామానికి చెందిన బొల్లి రమేష్, శ్రీకాంత్, శ్రావణ్, దాసరి సత్యం, పుండరి రాకేష్‌లను పట్టుకొని వీరిపై కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.