క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోరంట్ల, జూలై 5 : మండల పరిధిలోని ఎగువగంగంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు ఎస్సై సుధాకర్‌యాదవ్ తెలిపారు. దాసిరెడ్డిపల్లితండాకు చెందిన గోపీనాయక్ ద్విచక్ర వాహనంలో పాలు తీసుకుని గంగంపల్లిలోని పాలసేకరణ కేంద్రంలో ఇచ్చి గ్రామానికి తిరిగి వస్తూ మార్గమధ్యలో దాసిరెడ్డిపల్లితండాకు చెందిన నరసింహనాయక్‌ను వాహనంలో ఎక్కించుకున్నాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత వాహనం అదుపు తప్పి కింద పడటంతో నరసింహనాయక్ (52) అక్కడికక్కడే మృతి చెందాడు. గోపీనాయక్ తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. సమాచారం అందగానే సీఐ రవికుమార్‌తో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన గోపీనాయక్‌ను చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.