క్రైమ్/లీగల్

ధర్మవరంలో రిమాండ్ ఖైదీ పరారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం, జూలై 17 : ధర్మవరంలో మంగళవారం ఓ హత్య కేసులో నిందితుడై రిమాండ్‌లో వున్న షిఖారిరోయి అలియాస్ రవి అనే ఖైదీ వాయిదా నిమిత్తం సబ్‌జైలు నుండి కోర్టుకు తీసుకువెళ్తున్న సమయంలో పోలీసుల కళ్లు గప్పి పరారీ అయ్యాడు. వివరాల్లోకి వెళితే బత్తలపల్లి మండలం రామాపురం వద్ద గత యేడాది నవంబర్ 4వ తేదీన శ్రీనివాస్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో నిందితుడైన షిఖారిరోయి అలియాస్ రవిని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి అతని ఆధార్ కార్డు ఆధారంగా కంబదూరుకు చెందినవాడుగా గుర్తించి ఈ యేడాది ఏప్రిల్ నెలలో బత్తలపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుండి ధర్మవరం సబ్‌జైలులో రిమాండ్‌లో వున్న షిఖారిరోయి అలియాస్ రవిని పలుసార్లు వాయిదా నిమిత్తం ధర్మవరం కోర్టుకు తరలిస్తూనే వున్నారు. మంగళవారం సైతం బాలక్రిష్ణను బత్తలపల్లి స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ సబ్‌జైలు నుండి కోర్టుకు తీసుకువెళ్తున్న సమయంలో అతని కళ్లు గప్పి పరారీ అయ్యాడు. ఈ సంఘటన పోలీసు వర్గాలలో కలకలం రేపడంతో పోలీసులు అప్రమత్తమై పరారీ అయిన రిమాండ్ ఖైదీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా కానిస్టేబుల్ బాలక్రిష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ హరినాథ్‌కు తెలిపారు.