ప్రకాశం

అభివృద్ధికి సంక్షేమానికి మారుపేరు టీడీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మర్రిపూడి, జూలై 19: గ్రామాల అభివృద్ధికి, సంక్షేమానికి మారుపేరు తెలుగుదేశంపార్టీ అని కొండెపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు. గురువారం మండలంలోని పన్నూరు, వల్లాయపాలెం గ్రామాల్లో జరిగిన తెలుగుదేశం పార్టీ గ్రామదర్శిని- వికాసం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్, దామచర్ల కుటుంబ ఆశీస్సులతో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు. ఏ రాష్ట్రప్రభుత్వం చేయని అభివృద్ధి కొండెపి నియోజకవర్గంలో చేశామని, గ్రామగ్రామాన సీసీ రోడ్లు, ఎన్టీఆర్ గృహాలు, రేషన్ కార్డులు పంపిణీ చేశామన్నారు. పన్నూరు గ్రామంలో సర్పంచ్ తమ పార్టీకి సహకరించక అభివృద్ధి కుంటుపడిందని, వారం రోజుల్లో సర్పంచ్ పదవీకాలం పూర్తవుతుందని, సంక్రాంతి పండగ నాటికి గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. దళితులు కోరినట్లుగా పక్కాగృహాలు నిర్మించుకునేందుకు ఇళ్లస్థలాలు ఇవ్వాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎకరా పదిలక్షల రూపాయలకు కొనుగోలు చేసయినా ఇళ్ల స్థలాలు ఇస్తానని, వచ్చే క్రిస్మస్ పండగ నాటికి దళితవాడలోని అన్ని రోడ్లను సీసీ రోడ్లుగా మారుస్తానని దళితులకు హామీ ఇచ్చారు. అంతేకాకుండా చర్చి నిర్మాణానికి ఐదులక్షల రూపాయలు మంజూరు చేయిస్తానన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రెండులక్షల రూపాయలతో ఎన్టీఆర్ గృహాలను నిర్మిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ కన్వీనర్ సీహెచ్ నర్సారెడ్డి, జెడ్పీటీసీ నరసింహరావు, వైస్ ఎంపీపీ హనుమారెడ్డి, మర్రిపూడి సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాసులు, కాకర్ల పీహెచ్‌సీ అభివృద్ధి కమిటి చైర్మన్ రేగుల వీరనారాయణ, మండల తెలుగుయువత అధ్యక్షుడు బొర్రా శ్రీనివాసులు, టీడీపీ నాయకులు బొమ్మినేని ప్రభాకర్, చిలకల కొండారెడ్డి, రవి, మందలపు వెంకటేశ్వర్లు, భాస్కరనాయుడు, పోతయ్య పలుగ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.