ఆంధ్రప్రదేశ్‌

ఆగస్టు నాటికి పదివేల మంది తరలింపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర సచివాలయ సిబ్బంది తరలింపుపై మరోమారు మున్సిపల్ మంత్రి డాక్టర్ పి నారాయణ ఉద్యోగుల నేతలతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్ పి టక్కర్ సైతం పాల్గొన్నారు. జూలై 15 నాటికి 4వేల మందిని, జూలై మరో 3వేల మందిని, ఆగస్టుకి మరో 3వేల మంది ఉద్యోగులను తరలించాలన్న ప్రతిపాదనను ఉద్యోగ సంఘాల ముందుంచారు. వెలగపూడి సచివాలయంలో ప్రస్తుతం నిర్మిస్తున్న రెండు అంతస్తులతో పాటు మరో రెండు అంతస్తులను నిర్మించాలని నిర్ణయించినట్టు మంత్రి వారికి చెప్పారు. సచివాలయ భవనం రెండు అంతస్తులను జూన్ 15కి పూర్తి చేసి, జూలైకి మరో అంతస్తు, ఆగస్టుకి మరో అంతస్తు నిర్మించాలని భావిస్తున్న ప్రభుత్వం వితల వారీ ఉద్యోగులను తరలించాలని భావిస్తున్న మంత్రి వారికి వివరించారు. దానికి ఉద్యోగ సంఘాల నాయకులు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది.