యాత్ర పాట విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాల్ని తిరగరాసిన డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి బయోపిక్‌లో మళయాల సూపర్‌స్టార్ మమ్ముట్టి నటిస్తున్న యాత్ర చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేశారు. దర్శకుడు మహి వి.రాఘవ్ ఈ బయోపిక్‌ని తెరకెక్కిస్తున్నారు. మడమ తిప్పని నాయకుడి పాత్రలో నటిస్తున్న మమ్ముట్టి పూర్తిగా ఆ ప్రజానాయకుడి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్, టీజర్‌కి రెండు రాష్ట్రాల ప్రజల నుండి అనూహ్యమైన స్పందన రావటంతో యూనిట్ అంతా చాలా ఆనందంగా వున్నారు. తెలుగు ప్రజల ఎమోషనల్ కథని, ఫ్యాషనేట్ యాత్రని నిర్మిస్తున్న 70 ఎం.ఎం. ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమాని వ్యాపారంగా కాకుండా ఫ్యాషన్‌గా చిత్రాలు నిర్మించే నిర్మాణ సంస్థలు తెలుగు చిత్రసీమలో చాలా తక్కువగా వున్నాయి. ఆ కోవలోకి వచ్చే మరో నిర్మాణ సంస్థ 70 ఎం.ఎం. ఎంటర్‌టైన్‌మెంట్స్. ఈ బ్యానర్‌పై నిర్మాతలు విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డిలు సంయుక్తంగా భలే మంచిరోజు, ఆనందోబ్రహ్మ చిత్రాలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. బ్యానర్‌లో హ్యాట్రిక్ చిత్రంగా రూపొందుతున్న యాత్రని ప్రెస్టిజియస్‌గా, అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తెలుగు ప్రజలందరూ తప్పకుండా చూడవలసిన చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. 60 రోజుల్లో 1500 కిలోమీటర్లు కాలి నడకతో కడప దాటి ప్రతి ఇంటి గడపలోకి వెళ్ళి పేదవాడి కష్టాన్ని, అక్కాచెల్లెళ్ళ బాధల్ని, రైతుల ఆవేదనని చూసి వారితో కలసి నడిచి వారి గుండె చప్పుడుగా మారి వారి కష్టాల్ని తన కళ్ళతో చూసి బరువెక్కిన గుండెతో ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించిన ఏకైక నాయకుడు దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి అన్నారు.