21న నన్ను దోచుకుందువటే
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సమ్మోహనంతో తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహనం చేసిన సుధీర్బాబు హీరోగా, సుధీర్బాబు ప్రొడక్షన్స్ బ్యానర్లో ఆర్.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘నన్ను దోచుకుందువటే..’ ఈ చిత్ర ఫస్ట్లుక్ టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కానె్సప్ట్ డిఫరెంట్గా ఉండడం.. హీరో, హీరోయిన్ పెర్ఫార్మెన్స్ ఫ్రెష్గా అనిపించడంతో అన్ని వర్గాల ప్రేక్షకులనుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఆఫీస్ మొత్తం భయపడే సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజర్గా సుధీర్బాబు నటించగా.. అల్లరి చేసే గడుసు అమ్మాయి సిరి పాత్రలో హీరోయిన్ నభా నటేశ్ నటించింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రెడీ అవుతున్న ఈ చిత్రాన్ని ఈనెల 21న గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ... ‘నన్ను దోచుకుందువటే’ చిత్ర టీజర్ని జూలై 14న విడుదల చేశాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా హీరో, హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్కి అందరూ కనెక్ట్ అయ్యారు. ఈ చిత్రాన్ని ఈనెల 21న విడుదల చేసేందుకు సిద్ధవౌతున్నాం. సమ్మోహనం లాంటి మంచి బ్లాక్బస్టర్ చిత్రం తరువాత సుధీర్బాబు నుంచి వస్తున్న చిత్రం కావటంతో ప్రేక్షకులనుంచి అంచనాలు భారీగా వున్నాయి. సుధీర్బాబుగారి ఫస్ట్ ప్రొడక్షన్లో నన్ను నమ్మి, నా కథను నన్మి అవకాశం ఇచ్చారు. సమ్మోహనం సూపర్ హిట్ అయిన తర్వాత నాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన సుధీర్బాబుగారికి స్పెషల్గా థాంక్స్ తెలియజేస్తున్నాను. కొత్త హీరోయిన్ అయినప్పటికీ నభానటేశ్ చాలా బాగా చేసింది. అజనీష్ సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్గా నిలుస్తుంది అని అన్నారు. చిత్ర కథానాయకుడు, నిర్మాత సుధీర్బాబు మాట్లాడుతూ.. మా సొంత బ్యానర్ సుధీర్బాబు ప్రొడక్షన్లో నిర్మిస్తున్న ‘నన్ను దోచుకుందువటే’ చిత్రాన్ని ఈనెల 21న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాం. డైరెక్టర్ ఆర్.ఎస్.నాయుడు చాలా మంచి కథ స్క్రీన్ప్లేతో సినిమా రూపొందించాడు. టీజర్కు వచ్చిన రెస్పాన్స్తో చాలా హ్యాపీగా ఉన్నాం. అజనీష్ మ్యూనిక్, సురేష్ కెమెరా వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలుస్తాయి. హీరోయిన్ నభ నటేష్ చాలా బాగా నటించింది. అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే విధంగా సినిమా వచ్చింది’’ అని అన్నారు.