సస్పెన్స్ థ్రిల్లర్తో...
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రసాద్ ల్యాబ్స్ ఎడిటింగ్ విభాగంలో పలు చిత్రాలకు పనిచేసిన జగన్ (జె.డి) నిర్మాతగా మారి పరమశివ ఆర్ట్స్ బ్యానర్పై నిర్మిస్తోన్న చిత్రం ‘నా పేరు తంత్ర’. మేడం శ్రీ్ధర్ దర్శకుడు. తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత జగన్ మాట్లాడుతూ- సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గ్రాఫిక్స్కు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. 30 మంది గ్రాఫిక్ నిపుణులు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. గోవాలో తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటోంది అన్నారు. దర్శకుడు శ్రీ్ధర్ మాట్లాడుతూ- టైటిల్కు తగ్గట్టుగానే విభిన్నమైన కథా కథనాలతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఈ సినిమా ఉంటుంది. షియాజీ షిండే, ఛత్రపతి శేఖర్, సుమన్శెట్టిలు ప్రధాన పాత్రల్లో అలరిస్తారన్నారు. వంశీ, ఆర్తి, తపస్వి, ఐశ్వర్య, విజయ్, సంజన జంటలుగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: జాక్పొట్ల, కెమెరా: చక్రి, కథ,స్క్రీన్ప్లే, దర్శకత్వం: శ్రీ్ధర్.ఎం, నిర్మాత: జగన్ (జె.డి.)