బిజినెస్

విమానాశ్రయాల్లో ఎమ్మార్పీకే తేనీరు, అల్పాహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: దేశవ్యాప్తంగా ప్రభుత్వ నేతృత్వంలో నడుస్తున్న విమానాశ్రయాల్లో తేనీరు, అల్పాహారాలను (టీ, స్నాక్స్) ఎమ్మార్పీ ధరలకే ఆందించేందుకు ఎయిర్‌పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కొన్ని రకాల డ్రింక్‌లతోబాటు, ప్యాక్‌చేసిన మంచినీటిని ప్రయాణీకుల సౌకర్యార్థం ఎమ్మార్పీ ధరలకు విక్రయిస్తున్నట్లు ఏఏఐ అధికారులు తెలిపారు. ఎయిర్‌పోర్టు టెర్మినల్స్ వద్ద డ్రింకులు, ఆహార పదార్థాలు అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయంటూ అనేక ఫిర్యాదులు ప్రయాణికుల నుంచి వస్తుండటంతో ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందన్నారు. చెన్నై విమానాశ్రయంలో కనీసం తేనీరు ధర కూడా అందుబాటులో లేదని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం ట్విట్టర్‌లో విమర్శించారు. అంతేకాకుండా పార్లమెంట్‌లో సైతం ఈ రేట్ల విషయం చర్చకు వచ్చిన క్రమంలోప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలకు ఉపక్రమించింది. కాగా న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ప్రముఖ విమానాశ్రయాలతోబాటు 90 విమానాశ్రయాల్లో ప్రత్యేక తేనీరు, అల్పాహార విక్రయ కౌంటర్లు ఏర్పాటవుతున్నట్లు అధికారులు వివరించారు. ఈ రోజుల్లో కేవలం సంపన్న వర్గాలేకాకుండా మధ్య తరగతి సామాన్య ప్రయాణికులు కూడా విమానయానాన్ని ఎంచుకుంటున్నారు. ప్రత్యేకించి ఉడాన్ పథకం కింది స్థాయి వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉండటంతో గత నాలుగేళ్ల కాలంలోమనదేశంలో విమానయాన ప్రయాణికుల శాతం 25 పెరిగింది.