తెలంగాణ
టీఆర్ఎస్లోకి ఎంఐఎం నేతలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 12 September 2018
హైదరాబాద్, సెప్టెంబర్ 11: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ ఎంఐఎం నేతలు పలువురు మంగళవారం ఇక్కడ ఎంపి కల్వకుంట్ల కవిత నివాసంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎంఐఎం సీనియర్ నేత షేక్ బాసిత్, మాజీ కౌన్సలర్ షేక్ అలీముద్దీన్, వ్యాపారవేత్త మహమ్మద్ కబీర్ ఉద్దీన్ తదితరులకు ఎంపి కవిత గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే నిజామాబాద్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అన్వర్ కూడా కవిత సమక్షంలో టీఆర్ఎస్లో చేరినట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
చిత్రం..హైదరాబాద్లోని ఎంపీ కల్వకుంట్ల కవిత నివాసంలో టీఆర్ఎస్లో చేరిన నిజామాబాద్ ఎంఐఎం నాయకులు