మెయిన్ ఫీచర్

ఆదిదేవా.. నమోస్తుతే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్లో॥ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్‌
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే॥
అయం ముహూర్త స్సుముహూర్తో అస్తు
తదేవ లగ్నం, సుదినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ,
విద్యాబలం, దైవబలం తదేవ, లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి॥

భాద్రపద శుద్ధ చవితినాడు ఉదయానే్న లేచి స్నానమాచరించి, సంధ్యా వందనం మొదలగు నిత్యకర్మలను చేసుకుని తమ శక్తికి తగినట్లుగా వెండితోగానీ, బంగారంతోగానీ, తుదకు మట్టితోగానీ వినాయక ప్రతిమను చేసుకుని ఇంటి ఉత్తరవైపున ఒక పాలవెల్లిని ఏర్పరిచి దాని నడుమ ఎనిమిది దళములు గల కమలమును యవలతోగానీ, బియ్యంపిండితోగానీ నిర్మించి అచ్చట ఆ ప్రతిమను ఉంచి భక్తిపూర్వకముగా తెల్లని గంధముతోను, అక్షతలతోను, పూలతోను, గరిక పోచలతోను.. ఇలా ఇరువది ఒక్క పత్రములతో పూజచేసి, ధూమ దీపములను సమర్పించి నేతితో వండిన కుడుములు, అరటిపండ్లు, నేరేడుపండ్లు, వెలగపండ్లు, చెరుకుగడలు, కొబ్బరికాయ, మరి అనేక విధాల లభ్యమయ్యే భక్ష్యములు, పండ్లు నైవేద్యంగా సమర్పించి వినాయకుని దనివి నొందించి భక్తితో ఈ వ్రతమును ఆచరించినవారు ఎట్టి విఘ్నములు లేక కార్యసిద్ధిని పొందెదరని స్కాంద పురాణం చెప్తోంది.

పంచముఖ గణపతి

ఐదు ముఖాలతో దర్శనమిచ్చే గణపతిని హేరంబ గణపతి అని కూడా పిలుస్తారు. సింహ వాహనుడైన ఈ స్వామి పది చేతులతో దర్శనమిస్తుంటాడు. ముందు రెండు చేతులలో అభయ, వరద ముద్రలతో, వెనుకనున్న మిగతా ఎనిమిది చేతులలో అంకుశం, గదాయుధం, చెరకువిల్లు, శంఖు, చక్రం, పాశం, తామరపువ్వు, ధాన్యపుకంకిని పట్టుకుని నయన మనోహరంగా గోచరిస్తుంటాడు. కొన్ని విగ్రహాలలో ధాన్యపు కంకి, తామరపువ్వులకు బదులుగా రత్నకలశాన్ని పట్టుకుని ఉన్నట్లుగా కనిపిస్తుంటుంది. స్వామివారు తెల్లని శరీరకాంతితో మెరిసిపోతుంటారు.

నృత్యగణపతి

నేపాల్ దేశంలో గణేశ భక్తులు నృత్య గణపతిని ఎక్కువగా పూజిస్తుంటారు. ఈ గణపతి ఎరుపురంగులో మెరిసిపోతుంటాడు. అంతే కాదు ఈయన త్రినేత్రుడు. తన వాహనమైన ఎలుకపై కుడికాలును కొద్దిగా మడిచి పెట్టి నృత్యం చేస్తున్న గణపతి, ఎడమ కాలును పూర్తిగా పైకెత్తగా, ఆ కాలు బొజ్జను చుట్టుకుని ఉన్న నాగబంధాన్ని తాకుతున్నట్లు ఉంటుంది. పనె్నండు చేతులతో దర్శనమిచ్చే ఈ స్వామివారు విఘ్నాలను తొలగించి, కోరుకున్న కోరికలను వెంటనే తీరుస్తాడన్నది నేపాల్ భక్త జన విశ్వాసం. అటువంటి నృత్య గణపతులను మనదేశంలోని హాలిబేడు హోయసలేశ్వరాలయం, మధుర మీనాక్షీ ఆలయం, బీదర్ జిల్లా జలసంగవి వంటి క్షేత్రాలలో దర్శించుకోవచ్చు. హాలిబేడు హోయసలేశ్వరాలయ గోడపైనున్న నృత్యగణపతి మూర్తి అత్యంత సుందరరూపంతో దర్శనమిస్తుంటారు. ఎనిమిది చేతులతో కనిపించే ఈ స్వామి ముందు రెండు చేతులు దండముద్ర, విస్మయముద్రతో కనిపిస్తుండగా, వెనుకనున్న ఆరు చేతుల్లో పరశు, పాశ, మోదక పాత్ర, దంత, సర్ప, కమల పుష్పాలు ఉన్నాయి. కరండమకుటంతో నృత్యం చేస్తున్న ఈ గణపతి నిలబడిన పీఠభాగంలో మరుగుజ్జులు వాయిద్యాలు వాయిస్తున్నట్లుగా చూడగలము.
మధుమ మీనాక్షీ దేవాలయం స్తంభం పైనున్న నృత్య గణపతి, ఎలుకపై నృత్యం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎడమకాలితో ఎలుకపై నించున్న ఈ గణపతి, కుడికాలును పైకెత్తి నృత్యం చేస్తున్నట్లుగా దర్శనమిస్తాడు. ఎనిమిది చేతులతో దర్శనమిచ్చే ఈ నృత్యగణపతి కుడివైపున్న నాలుగు చేతులలో పరశు, వలయ, పుష్పం, దంతాలతో.. ఎడమవైపు నాలుగు చేతుల్లో అంకుశం, పాశం, మోదకం, ఫలాలు ఉంటాయి. ఇప్పుడిప్పుడే దక్షిణ భారతదేశంలో కూడా నృత్య గణపతి పూజకు విశేష ఆదరణ లభిస్తోంది.

కవల సోదర వినాయకులు

తమిళనాడులోని అరుణాచల క్షేత్ర గిరి ప్రదక్షిణ అత్యంత పుణ్యప్రదమని భక్తజన విశ్వాసం. అరుణాచల గిరి ప్రదక్షిణ చేసే భక్తులు ప్రదక్షిణ మార్గంలో.. ముందుగా కనిపించే విఘ్నేశ్వరుని ఆలయంలో పూజలు చేసి ప్రదక్షిణను మొదలుపెడతారు. భక్తితో విఘ్నేశ్వర గర్భాలయం వైపు చూసిన భక్తులు ఆశ్చర్యపోతుంటారు. కారణం గర్భాలయంలో కవల సోదర వినాయకులు దర్శమిస్తుంటారు. ఈ ఆలయంలో వినాయకుడు కవలలుగా అవతరించడానికి వెనుక ఓ ఆసక్తికరమైన ఉదంతం ఉంది.
సుమారు 452 సంవత్సరాల క్రితం, వీరబాహుదేశికుడు అనే శివభక్తునికి స్వయంభువైన ఓ వినాయక ప్రతిమ దొరకడంతో, ఆ వినాయకునికి ఆలయాన్ని నిర్మించే పనిలో నిమగ్నమయ్యాడు. అరుణాచల క్షేత్రానికి ఉత్తర దిశలో ఆలయ నిర్మాణాన్ని చేసేందుకై భూమిని తవ్విస్తున్న అతను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆ తర్వాత అతని సంతోషానికి అవధుల్లేవు. అందుకు కారణం ఏంటంటే.. స్వయంభువుగా లభించిన వినాయకుని కోసం ఆలయాన్ని నిర్మించే పనిలో ముమ్మరమై ఉన్న తనకు, ఆలయ నిర్మాణానికై పునాదులను తవ్వుతున్నప్పుడు, ఆ స్వయంభువు విగ్రహాన్ని పోలిన మరో విగ్రహం లభించింది. అదంతా దైవ నిర్ణయంగా భావించిన వీరబాహుదేశికుడు ఆ కవల గణపతులను శాస్త్రోక్తంగా ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించాడు. అరుణాచల గిరిప్రదక్షిణ చేసే భక్తులు మొదట ఈ కవల గణపతులను దర్శించుకుని పూజిస్తే కోరుకున్న కోరికలన్నీ ఫలిస్తాయని భక్త జన విశ్వాసం.
* వైష్ణవ ఆగమంలో గణపతిని విష్ణువుగా పూజిస్తారు. మధ్యప్రదేశ్‌లోని మండేసేర్ నందు, కన్యాకుమారి(శుచీంద్రం)లోను, మధుర సుందరేశ్వర్ ఆలయాలలో గణపతిని స్ర్తి రూపంలో కొలుస్తారు. టిబెట్, చైనా, జపాన్, బర్మా, మెక్సికో, కంబోడియా, అమెరికా మొదలగు ప్రాంతాలలో పూజలందుకుంటున్న గణపతి దేవుడు విశ్వవ్యాపకుడు.

-ఎస్.ఎన్.ఉమామహేశ్వరి