క్రైమ్/లీగల్

చెరువులో మునిగి యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదవేగి, సెప్టెంబర్ 18 : వినాయక నిమజ్జనం అనంతరం తిరిగి చెరువుకు వెళ్లిన యువకుడు చెరువులో మునిగి మృతిచెందిన ఘటన పెదవేగి మండలం కొప్పాకలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పెదవేగి ఎస్‌ఐ వి కాంతిప్రియ తెలిపిన వివరాల ప్రకారం కొప్పాకలో ఒకే ఇంటి పేరుతో వున్న అయిదు కుటుంబాలు వినాయక ప్రతిమను ఏర్పాటు చేసుకుని అయిదు రోజులపాటు పూజలు చేశారు. అయిదవ రోజు సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులందరూ కలిసి గణేష్ ప్రతిమను ఊరేగించి కొప్పాక సమీపంలో పోలవరం కాలువలో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. తిరిగి ఇంటికి వచ్చిన తరువాత పులుసు సతీష్ అతని చిన్నాన్న రవి కలిసి ప్రతిమ ఉన్న చోట పత్రి సామాగ్రిని, అఖండ జ్యోతిని చెరువులో కలపడానికి గ్రామాన్ని ఆనుకుని వున్న చిన్న చెరువు వద్దకు రాత్రి 10 గంటల సమయంలో వెళ్లారు. వాటిని చెరువులో కలిపి స్నానం చేసి బయటకు వచ్చారు. వారు తీసుకువచ్చిన పళ్లాన్ని శుభ్రం చేద్దామని సతీష్ తిరిగి చెరువులోకి దిగాడు. పళ్లెం శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తూ చెరువులో పడిన సతీష్ నీటిలో మునిగి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న ఎస్ ఐ కాంతిప్రియ సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది సహకారంతో గాలింపు చర్యలు చేపట్టగా అర్ధరాత్రి 12 గంటల సమయంలో మృతదేహాన్ని చెరువు నుంచి వెలికి తీశారు. మంగళవారం ఉదయం పంచనామా అనంతరం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.