చిత్తూరు

ఎస్‌ఎస్ కెనాల్‌ను వెంటనే పూర్తి చేయాలంటూ పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, సెప్టెంబర్ 25: శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు సాగు, తాగునీరు అందించే ఎస్‌ఎస్ కెనాల్‌ను వెంటనే పూర్తి చేయాలని కోరుతూ శ్రీకాళహస్తి పట్టణంలోని బంగారమ్మ గుడి వద్ద నుండి ముచ్చివోలు గ్రామం వరకు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి బియ్యపు మధుసూదన్‌రెడ్డి మంగళవారం పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లోని రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన ఎస్‌ఎస్ కెనాల్‌ను తెలుగుదేశం ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని, లేని పక్షంలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. వైసీపీ అధినే జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 3వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యాత్రను చేపట్టామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనకు మహిళలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, దారిపొడవునా మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అంజూరు శ్రీనివాసులు, మిద్దెల హరి, వాసుదేవనాయుడు, మధుశేఖర్, కృష్ణారెడ్డి, హేమభూషన్‌రెడ్డి, సిరాజ్‌బాషా, చిలకా గోపీ, మాధవరావు, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.