క్రీడాభూమి

భారత్‌తో మ్యాచ్ టై కావడం మాకు విజయంకన్నా గొప్పది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, సెప్టెంబర్ 26: భారత్ వంటి అత్యుత్తమ క్రికెట్ జట్టుతో జరిగిన పోరును టైగా ముగించడాన్ని తమ జట్టు మరిచిపోలేని విజయంకన్నా గొప్ప విషయంగా భావిస్తోందని ఆఫ్గనిస్తాన్ జట్టు సారధి అస్గార్ ఆఫ్గాన్ పేర్కొన్నాడు. మంగళవారం రాత్రి ఇరు జట్లు నువ్వానేనా అనే విధంగా సాగించిన ఉత్కంఠభరిత పోరాటాన్ని ఆయన గుర్తుచేస్తూ మహమ్మద్ షహజాద్ అద్భుత సెంచరీతో తమ జట్టు 252 స్కోర్ చేయడానికి తోడ్పడ్డాడన్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లో లక్ష్యాలను సులభంగా చేధించిన భారత్ జట్టుతో జరిగిన పోరులో తమ జట్టు అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించి అభిమానులను అలరించిందడు. సూపర్-4లో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన ఆఫ్గనిస్తాన్ టీం గ్రూప్ స్టేజ్‌లోశ్రీలంక, బంగ్లాదేశ్‌లను ఓడించడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో తమ సత్తాను చాటిన సంగతి తెలిసిందే.