బిజినెస్

మధ్యంతర డివిడెండ్ ప్రకటించిన కాల్గేట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28: ఎఫ్‌ఎమ్‌సిజి సంస్థ కాల్గేట్ పామోలివ్ (ఇండియా) లిమిటెడ్.. సోమవారం మూడోసారి మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2015-16)గాను రూపాయి విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేర్‌కు 3 రూపాయల డివిడెండ్‌ను ఇవ్వాలని నిర్ణయించింది. ఇక్కడ జరిగిన సంస్థ బోర్డు సమావేశంలో ఈ మేరకు ఆమోదం కూడా వచ్చినట్లు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు కాల్గేట్ పామోలివ్ స్పష్టం చేసింది. కాగా, ఇంతకుముందు కూడా 2015-16కు నవంబర్‌లో తొలిసారిగా 4 రూపాయల చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించగా, డిసెంబర్‌లో 3 రూపాయల చొప్పున రెండోసారి మధ్యంతర డివిడెండ్‌ను ఇచ్చింది.