మెదక్

ప్రజా సేవకుడిగా పనిచేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, నవంబర్ 16: సంగారెడ్డి నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని, నిండు మనస్సుతో మరో సారి ఆశీర్వదించాలని తాజా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణ శివారులోని వైకుంఠపురం గోదా సమేతా విరాట్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదచార్యులు నామినేషన్ పత్రాలను స్వామి వారి పాదల వద్ద పెట్టి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దర్గా, చర్చిలో ప్రార్థనలు చేసి తహసీల్ధార్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నామినేషన్ వేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన అవకాశంతో నియోజకవర్గంలో రూ.2వేల కోట్ల అభివృద్ధి పనులు చేసానని, మరో అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, నాయకులు కాసాల బుచ్చిరెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.