ఆంధ్రప్రదేశ్‌

తూ.గో. నుంచి పోటీకి జనసేనాని ఆసక్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, నవంబర్ 19: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా నుండి పోటీచేయడానికి ఆసక్తి చూపుతున్నారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ముత్తా గోపాలకృష్ణ చెప్పారు. కాకినాడ నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఈసందర్భంగా గోపాలృష్ణ మాట్లాడుతూ తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడ పార్లమెంటరీ నియోజక వర్గంలో నిర్వహించిన సభలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతంచేశారన్నారు. జిల్లా ప్రజలు చూపుతున్న ఆదరణతో కాకినాడ సిటీ, రూరల్, పిఠాపురం నియోజకవర్గాల నుండి పవన్ కల్యాణ్ పోటీచేయడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఆయన ఎక్కడ నుండి పోటీచేసినా 70వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిపించడానికి జనసైనికులు అందరూ కృషిచేస్తారన్నారు.
జిల్లా నుండే కాకుండా రాయలసీమ, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుండి పోటీచేసేందుకు పవన్ కల్యాణ్ ఆసక్తి కనబరుస్తున్నారని ముత్తా పేర్కొన్నారు. జిల్లాలో జనసేన పార్టీలో అసమ్మతి ఉంటే వారితో చర్చించి అసమ్మతి లేకుండా చూస్తామని వివరించారు. పార్టీని ప్రజల్లోకి తీసుకువెల్లడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. జనసేన పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందని, వారి ఆదరణకు అనుగుణంగా పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని ముత్తా గోపాలకృష్ణ తెలియజేశారు. విలేఖర్ల సమావేశంలో సంగిశెట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు.