రాష్ట్రీయం

‘ఓనావ కార్టూన్లు’ ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు ఓం ప్రకాశ్ నారాయణ వడ్డి రూపొందించిన ‘ఓనావ కార్టూన్లు’ పుస్తకాన్ని ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఇక్కడ జరిగిన ఆత్మీయుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనేక మంది సినీ, మీడియా ప్రముఖులు పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్టు ఓం ప్రకాశ్ ‘ఓ నావ’ పేరుతో వివిధ పత్రికల్లో పలు కార్టూన్లు గీశారు. వాటిని ఓనావ కార్టూన్లు పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. దీనిని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించి తొలి కాపీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ కూచిభోట్లకు అందించారు.
ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ బేసికల్‌గా కార్టూనిస్టులు అందరూ కోపిష్టులుగా ఉంటారని తన నమ్మకమని, సమాజంలోని రకరకాల విషయాలపై ఉన్న కోపాన్ని నవ్వు ద్వారా వారు వ్యక్తపరుస్తుంటారని చెప్పారు. తీవ్రవాదులైతే తుపాకులు పట్టుకుంటారు, వీరు మాత్రం కుంచె , కలం పట్టుకుని కార్టూన్లు గీస్తారని అన్నారు. అందువల్ల వీళ్లు సేఫ్ , పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకోచ్చే వాళ్లంటే తనకు చాలా ఇష్టమని , ఈ పుస్తకాన్ని ప్రచురించిన విశ్వప్రసాద్‌కు, వివేక్ కూచిభొట్లకు తన అభినందనలు అని చెప్పారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా మరిన్ని పుస్తకాలు రావాలని తాను కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. ఓం ప్రకాశ్ నారాయణ గీసిన పలు కార్టూన్లు ఫేస్‌బుక్‌లో చూసి తాను ఆనందించేవాడినని, వాటిని పుస్తకరూపంలోకి తీసుకురావాలనే ఆయన కోరికను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా నెరవేర్చడం ఆనందంగా ఉందని వివేక్ కూచిభొట్ల అన్నారు. పుస్తకాన్ని ప్రచురించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్‌కు, ఆవిష్కర్త త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఓం ప్రకాశ్ కృతజ్ఞతలు తెలిపారు. స్వర్గీయ వడ్లమూడి రామ్మోహన్‌రావుకు అంకితమిచ్చినట్టు తెలిపారు. కార్యక్రమంలో నాగభైరు సుబ్బారావు, ప్రసన్నప్రదీప్, రెంటాల జయదేవ్, ఎల్ వేణుగోపాల్, జై సింహా తదితరులు పాల్గొన్నారు.