కరీంనగర్

చలి పంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, డిసెంబర్ 18: జిల్లాపై చలి పంజా విసురుతోంది. ఇటు పెథాయ్ తుఫాను, అటు చల్లటి గాలుల భీభత్సం జిల్లా వాసులను వణికిస్తోంది. రెండు రోజులుగా మధ్యాహ్నం అయినా సూర్యకిరణాలు మాత్రం భూమిని తాకకపోవటంతోజిల్లా వాసులు గజ గజలాడుతున్నారు. నిరంతరం వీస్తున్న ఈదురు,శీతల గాలులు పలుచోట్ల వృద్ధుల పాలిట యమపాశాలవుతున్నాయి. చలి పులికి తట్టుకోలేక ఇప్పటికే జిల్లాలో పలువురు మరణించగా, లెక్కలేనంత మంది ఆస్పత్రుల పాలయ్యారు. విద్యార్థులు పాఠశాలలు, విద్యాలయాలకు డుమ్మా కొట్టి, తమ ఇళ్ళ నుంచి బయటకు రాకుండా ముసుగుతన్నుతున్నారు. చిన్నారులు, వృద్దుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి తీవ్రత బాగా పెరుగుతుండగా, వీధి వ్యాపారులు, వేకువ జామున పనులు చేసుకునేవారు బాగా ఇబ్బందులనెదుర్కొంటున్నారు. సాయంత్రం ఐదింటి నుంచే చలి తన ప్రతాపాన్ని చూపుతుండగా, అత్యధిక మంది జనాలు తమ తమ పనులు వదిలి, ఇళ్ళకే పరిమితమవుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్ళాల్సి వస్తే తగిన మేరకు ఉలెన్ దుస్తులు ధరించి, వెళ్తున్నారు. అయినా, వెంటనే వచ్చి ఇళ్ళలో చలి మంటలు కాగుతున్నారు. యువత, మద్యవయస్కులను సైతం చలి బెంబేలెత్తిసుండగా, మిగతావారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఉత్తర భారతం నుంచి వీస్తున్న గాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉండటంతోపగటిపూట చలిగాలుల తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఫలితంగా రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశాలున్నట్లు అధికార యంత్రాంగం పేర్కొంటుండగా, పెథాయ్ తుఫాను ప్రభావంతోపగటిపూట ఉష్టోగ్రతలు పడిపోయి, కేవలం 20నుంచి 21 డిగ్రీల సెల్సియస్ వరకు మాత్రమే నమోదువుతున్నట్లు తెల్పుతున్నారు. దీనికితోడు ఉత్తర దిక్కు నుంచి వచ్చే గాలుల ప్రభావంతో రాత్రిపూట చలి తీవ్రత మరింతగా పెరుగుతుండగా, రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం కోరుతుంది.