వరంగల్

బ్యాంక్ అధికారులమంటూ ఖాతాదారునికి ఫోన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగెం, డిసెంబర్ 18: బ్యాంక్ అధికారులమంటూ అకౌంట్ దారునికి ఫోన్ చేసి ఎటియం పిన్ కోడ్ తెలుసుకున్న ఓ అపరిచితుడు డబ్బులు డ్రా చేసుకున్న సంఘటన సంగెం మండలం కొత్తగూడెం గ్రామంలో వెలుగుచూసింది. కొత్తగూడెం గ్రామానికి చెందిన ఎనబోతుల సాంబయ్యకు ఓ అపరిచితుడు ఫోన్ చేసి మీరు ఎస్‌బీఐ ఎటీఎంపై ఫిర్యాదు చేశారు. ఫిర్యా దు హెడ్ ఆఫీస్ వచ్చినది. మీకు ఇతర బ్యాంకులలో ఖాతా ఉంటే అట్టి బ్యాంక్ ఎటీయంపై ఉన్న డిజిటల్ నెంబర్లు చెపితే మీకు ఓటీపీ వస్తుందని ఆ ఓటిపి నెంబర్‌ను మాకు తెలిపితే మీరు చేసిన ఫిర్యాదు వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పారు. సాంబయ్యకు హింది రాకపోవడంతో అర్ధం కాక తన కోడలకు ఫోన్ ఇవ్వడంతో ఓటీపీ నెంబర్‌ను అపరిచితులకు తెలిపింది. దీంతో బాధితుడికి చెందిన సంగెం ఆంధ్రాబ్యాంక్ సంబంధించిన ఖాతా నుండి రూ. 44వేలు డ్రా చేసినట్లు బాధితుడు సెల్‌కు మెసెజ్ రావడంతో సదరు బాదితుడు సంగెం ఎస్సైకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు

చలి తీవ్రతకు ముగ్గురి మృతి
సంగెం/నల్లబెల్లి, డిసెంబర్ 18: చలి తీవ్రత తట్టుకోలేక ముగ్గురు మృతి చెందారు. సోమవారం రాత్రి సంగెం మండలం కుంటపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం రౌతు కొమురమ్మ(90) సంవత్సరాలు చలి తీవ్రత తట్టుకోలేక ఇంట్లోనే మృతిచెందినది. మృతురాలు కు నలుగురు కుమారులు, మూడో కుమారుడు మాజీ సర్పంచ్ లక్ష్మయ్య కావడంతో ఇతర గ్రామాల సర్పంచ్‌లు మృతురాలు కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రీయలలో పాల్గొన్నారు. అలాగే నల్లబెల్లి మండలంలోని రెండు గ్రామాలలో చలి తీవ్రతను తట్టుకోలేక ఇద్దరు మృతిచెందిన మంగళవారం వెలుగు చూసింది. నల్లబెల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన ఇంగోలి వీరన్న(58) అనే వృద్దుడు చలి తీవ్రతను తట్టుకోలేక తెల్లవారుజామున 3గంటలకు మృతిచెందినట్లు బందువులు తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. అదే విధంగా నారక్కపేట గ్రామానికి చెందిన శ్రీపతి ఐలమ్మ(65) వృద్దురాలు చలి తీవ్రతతో మృతిచెందింది.

విద్యుత్ ఆదాకు సౌర విద్యుత్ కేంద్రం
హంటర్‌రోడ్, డిసెంబర్ 18: స్మార్ట్ సీటీ మిషన్ క్రింద సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ప్రణాళిక చేపట్టనున్నట్లు బల్దియా కమిషనర్ వీపీ గౌతమ్ అన్నారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో లీ అసోసియేట్ ప్రతినిధులతో సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు డీపీఆర్ గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాదుతూ విద్యుత్ చార్జీల ఆదా కోసం బల్దియా ద్వారా స్మార్ట్ సీటీ మిషన్‌లో సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ప్రణాళిక చేస్తునట్లు ఆయన తెలిపారు. విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అనువైన స్థలం, సబ్ స్టేషన్ ఏర్పాటు తదితర సమగ్ర వివరాలతో పూర్తి కార్యాచరణ నివేదిక సమర్పిచాలని ఆయన అన్నారు.

రైతులకు నష్టపరిహారం అందించాలి
ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్
ఏటూరునాగారం, డిసెంబర్ 18: మండల వ్యాప్తంగా పెథాయ్ తుఫాన్‌తో నష్టపోయిన వరి, మిర్చి రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నా రు. మంగళవారం మండలంలోని చిన్నబోయినపల్లి, రామన్నగూడెం, రాంనగర్‌లతోపాటు మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను, పంట పొలాల్లోవున్న ధాన్యాన్ని, మిర్చి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఫోన్లో కలెక్టర్‌తో పాటు వ్యవసాయ, హార్టీ కల్చర్ అధికారులతో మాట్లాడారు. ఐకెపి, జిసిసి, పిఎసిఎస్‌ల ద్వారా తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జరిగిన పంట నష్టాన్ని వ్యవసాయ, హార్టీకల్చర్ అధికారులు సర్వేచేసి వరి, మిర్చి రైతులకు ఇన్‌పుట్ సబ్సిడి అందించాలన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని, పంట నష్టంతోపాటు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు రఘు, వెంకన్న, రామయ్య, ఖలీల్, దేవేందర్, రాము, కోటయ్య, చిన ఎల్లయ్య, బాలరాజు రాధిక తదితరులు పాల్గొన్నారు.