క్రైమ్/లీగల్

పోలీసులకు చిక్కిన గేదెల దొంగల ముఠా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పమిడిముక్కల, డిసెంబర్ 19: గత రెండు నెలలుగా పశువుల అపహరణకు గురవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేస్తున్నా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న గేదెల దొంగను పట్టుకోవాలంటే పోలీసులకు సవాల్‌గా మారింది. పలు ప్రాంతాలలో గేదెలను దొంగిలిస్తున్న ముఠా కోసం పమిడిముక్కల పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ సందర్భంగా పమడిముక్కల పోలీసు స్టేషన్ రెండు, గూడూరు పోలీసు స్టేషన్‌లో ఒకటి, తోట్లవల్లూరు పోలీసు స్టేషన్‌లో ఒకటి, పామర్రు పోలీసు స్టేషన్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయని ఎస్‌ఐ జి శ్రీనివాస్ తెలిపారు. ఉయ్యూరు కొబ్బరితోటకు చెందిన చీదెళ్ల శివనాగప్రసాద్, కె దాసు, తాడంకి గ్రామానికి చెందిన పంతం శ్రీనివాస్, మంటాడ ఇందిరమ్మ కాలనీకి చెందిన రతన్‌రాజు దొంగతనానికి పాల్పడ్డారని, రూ.6లక్షలు విలువ చేసే 12 గేదెలను అపహరించామని వారు తెలిపారని ఎస్‌ఐ వివరించారు. గేదెల దొంగ శివనాగప్రసాద్ ఎంసీఎ చదువుకోవటం విశేషం.