జాతీయ వార్తలు

మీ త్యాగం నిరుపమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్తనాదాలు, రోదనలు, ప్రతీకారాగ్నులు, శోకతప్త నివాళుల మధ్య వీర జవాన్ల అంత్యక్రియలు జరిగాయి. ఇద్దరు కేంద్ర మంత్రులు శవపేటికలు మోస్తూ జవాన్లకు ఘన నివాళులర్పించారు. దాదాపు అన్నిచోట్లా వేల సంఖ్యలోనే ప్రజలు హాజరై వీర సైనికుల త్యాగాలను శ్లాఘించారు. మరోపక్క బాధిత కుటుంబాల బాధ వర్ణణాతీతమే అయింది. ఎవరెంతగా ఊరడించినా..యావద్భారతం అండగా నిలిచినా ఆ కుటుంబాల్లో వేదనను చల్లార్చడం ఎవరితరం కాలేదు. పుల్వామా ముష్కర దాడి సూత్రధారుల భరతం పట్టాల్సిందేనన్న నినాదాలు ఆసేతుహిమాచలం రెండోరోజూ మార్మోగాయి.