ఆంధ్రప్రదేశ్‌

నేడు రాహుల్ తిరుమలకు రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 21: అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుక్రవారం తిరుపతికి రానున్నారు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో శుక్రవారం మధ్యాహ్నం 1.55గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుండి కారులో నేరుగా తిరుమలకు వెళతారు. ముందుగా కళ్యాణం బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శించుకుంటారు. అక్కడ నుండి బస కోసం ఏర్పాటు చేసి కృష్ణ అతిథిగృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నం భోజనం విరామం తర్వాత 3.35గంటలకు తిరుమల నుండి బయలుదేరి తిరుపతిలోని జ్యోతిరావు పూలే సర్కిల్‌కు చేరుకుంటారు. అక్కడ నుండి పాదయాత్రగా బహిరంగసభ ఏర్పాటు చేసిన తారకరామస్టేడియంకు 5గంటలకు చేరుకుంటారు. బహిరంగసభలో పాల్గొని 6గంటలకు తారకరామస్టేడియం నుండి రోడ్డు మార్గాన రేణిగుంట విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళతారు. వాస్తవానికి రాహుల్‌గాంధీ తిరుపతి నుండి కాలినడకన తిరుమలకు చేరుకుంటారని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. అయితే ఆయనకు కాలిబాటలో భద్రత కల్పించలేమని పోలీసులు చెప్పడంతో అలిపిరి మార్గాన కాలినడకన వెళ్లే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.