ఆంధ్రప్రదేశ్‌

ఇంటి దొంగలు ఎవరో జగన్ చెప్పాలి: వర్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 18: వివేకానంద రెడ్డి హత్య వెనుక ఉన్న ఇంటి దొంగలు ఎవరో ప్రతిపక్ష నేత జగన్ సమాధానం చెప్పాలని, హత్యను దాచిపెట్టి తొలుత గుండెపోటుతో మరణించారని ఎందుకు చెప్పారో బహిర్గతం చేయాలని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య డిమాండ్ చేశారు. సోమవారం ప్రజావేదిక సమీపంలోని మీడియా పాయింట్‌లో ఆయన విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్ల మాట్లాడుతూ జగన్ వాస్తవాలను కప్పిపుచ్చి టీడీపీ నాయకులపై ఆరోపణలు చేయడం ద్వారా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారని, పోలీసు విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. ఇంటి దొంగల గుట్టును ఇక దాచలేరని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై వర్ల రామయ్య అనేక ప్రశ్నాస్త్రాలు సంధించారు.
హత్య చేయబడ్డ వ్యక్తిని గుండెపోటుతో చనిపోయారని ఎవరు చెప్పమన్నారు? చనిపోయిన తరువాత చూసిన డాక్టర్ గంగిరెడ్డి ఇది హత్య అని ఎందుకు చెప్పలేదు? ఎవరి సూచన మేరకు సాక్ష్యాలు లేకుండా శుభ్రం చేశారో తెలియజేయాలన్నారు. డ్రైవర్ ప్రసాద్‌కు ప్రాణహాని ఉందని వివేకానందరెడ్డి భార్య చెప్పారని, ఎవరి నుండి ప్రాణహానీ ఉందో జగన్ చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు. సంఘటన జరిగిన రోజు ఉదయం 5.30 నుండి సాయంత్రం 5.30 వరకు జగన్ ఫొన్ వివరాలు బయటపెడితే బాగోతం బయటపడుతుందన్నారు. ఈ హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరమేశ్వరరెడ్డి ఇది ఇంటి దొంగల పని అని చెబుతున్నారని, మీ రాజకీయ కుట్రలోకి మమ్మల్ని లాగొద్దని ఆయన అంటున్నారని తెలిపారు. తన బాబాయ్‌ని చంపిన వారు ఎవరో జగన్‌కు తెలుసని, తనకు తెలిసిన నిజాలను దాచి ఇంటి దొంగలను కాపాడాలని చూస్తున్నారని రామయ్య ఆరోపించారు.