రాష్ట్రీయం
తొలి జాబితా ప్రకటించిన సీపీఐ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 19 March 2019
విజయవాడ, మార్చి 18: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సీపీఐ అభ్యర్థుల తొలిజాబితాను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ సోమవారం ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ (ఎస్టీ) అభ్యర్థిగా డాక్టర్ డీవీజీ శంకరరావు, విజయనగరం జిల్లా ఎస్ కోట అభ్యర్థిగా పీ కామేశ్వరరావు, విశాఖపట్నం పశ్చిమ అభ్యర్థిగా జేవీ సత్యనారాయణమూర్తి, గుంటూరు జిల్లా మంగళగిరి అభ్యర్థిగా ముప్పాళ్ల నాగేశ్వరరావు, ప్రకాశం జిల్లా కనిగిరి అభ్యర్థిగా ఎంఎల్ నారాయణ, కర్నూలు జిల్లా డోన్ అభ్యర్థిగా కే రామాంజనేయులును ప్రకటించారు. మిగిలిన అసెంబ్లీ అభ్యర్థులను, రెండు ఎంపీ స్థానాల అభ్యర్థులను మంగళవారం ప్రకటించనున్నట్లు రామకృష్ణ తెలిపారు.