జాతీయ వార్తలు

హామీలు అమలు చేసేది కాంగ్రెస్ పార్టీయే: వీహెచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 26: తెలంగాణలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు పేర్కొన్నారు. హనుమంతరావు విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఓటు వేసే ముందు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనీస ఆదాయ భద్రత పథకం అమలు చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. బీజేపీ 2014 ఎన్నికల ముందు ఆచరణ సాధ్యకాని హామీలు ఇచ్చి అమలు విషయంలో పూర్తిగా విఫలం చెందిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యమైన హామీలను మాత్రమే ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనీయా గాంధీలకే దక్కుతుందన్నారు.