రాష్ట్రీయం

ఒడిశా సీఎంకు బాబు ఫోన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఫొని పెను తుపాను ఒడిశాలో పూరీ వద్ద తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి మాట్లాడారు. అక్కడ తీసుకుంటున్న సహాయక చర్యల గురించి చర్చించారు. తుపాను ప్రభావం ఒడిశాపై ఎక్కువగా ఉండవచ్చని ఆర్టీజీఎస్ అందించిన సమాచారాన్ని పట్నాయక్‌తో పంచుకున్నారు. ఒడిశా ప్రభుత్వానికి ఎటువంటి సహాయ సహకారాలు అందించేందుకైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇటువంటి కష్టకాలంలోనే ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలన్న ఆకాంక్ష చంద్రబాబు వ్యక్తం చేశారు. గతంలో తుపాను సమయంలో 30 కోట్ల రూపాయలు విలువ చేసే సామగ్రిని ఒడిశాకు పంపిన విషయాన్ని గుర్తు చేశారు.

చిత్రం...తుపాను తీవ్రతను తెలుసుకుంటున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్