తెలంగాణ

పాలిటెక్నిక్ పేపర్లు దిద్దుతూ కుప్పకూలిన లెక్చరర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: మేడ్చెల్ పాలిటెక్నిక్ కాలేజీలో జవాబుపత్రాల మూల్యాంకనానికి హాజరైన కాంట్రాక్టు లెక్చరర్ సదాశివప్రసాద్(31) పేపర్లు దిద్దుతూ శుక్రవారం నాడు కుప్పకూలిపోయారు. ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లగా శనివారం ఉదయం ఐదు గంటలకు మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. గత పదేళ్లుగా ఆయన మెకానికల్ సబ్జెక్టు లెక్చరర్‌గా సాంకేతిక విద్యాకళాశాలల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేగుంట పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్నారు. వడదెబ్బకు గురై అస్వస్థతకు లోనయ్యారని సహచరులు చెబుతున్నారు. సదాశివప్రసాద్ మృతి పట్ల కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ భాస్కర్, కొప్పిశెట్టి సురేష్‌లు సంతాపాన్ని వ్యక్తం చేశారు. చనిపోయిన సదాశివప్రసాద్‌కు ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.