ఆంధ్రప్రదేశ్‌

ఎండ తీవ్రతకు కాలిపోయిన పవర్‌గ్రిడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చక్రాయపేట, మే 22: కడప జిల్లా చక్రాయపేటలో ఏర్పాటుచేసిన 40 మెగావాట్ల పవర్‌గ్రిడ్ ఎండ తీవ్రతకు బుధవారం మధ్యాహ్నం కాలిబూడిదైంది. దీంతో సుమారు రూ.90 కోట్ల మేరకు ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. జిల్లాలోని చక్రాయపేట మండలంలో ఏడాది క్రితం విద్యుత్ ఉత్పత్తి కోసం 40 మెగావాట్ల ప్లాంటు ఏడాది క్రితం ఏర్పాటుచేసినట్లు సైట్ ఇంజనీర్ సంపత్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రారంభించడంలో జాప్యం జరిగింది. రెండు మూడు రోజుల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా బుధవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఎండ తీవ్రతకు పవర్‌గ్రిడ్ కాలిపోయింది. మంటలు తీవ్రం కాగానే లక్కిరెడ్డిపల్లె, పులివెందులలోని అగ్నిమాపక కేంద్రాలకు సమాచారం అందించారు. అగ్నిమాపక శకటాలు వచ్చేసరికి పవర్‌గ్రిడ్ పూర్తిగా కాలిపోయింది.

చిత్రం...మంటల్లో కాలుతున్న పవర్‌గ్రిడ్