ఆంధ్రప్రదేశ్‌

పులివెందులలో అంబరాన్నంటిన సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల, మే 23: ఎన్నికల్లో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఘన విజయం సాధించడంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పులివెందులలో వైకాపా అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. గురువారం ఉదయం నుంచి వైకాపా భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తుండడంతో జనం, పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉదయం నుంచే రోడ్లపైకి చేరుకుని సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా కాలుస్తూ, బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ, డప్పు వాయిద్యాలు వాయిస్తూ రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. మహిళలు సైతం పురవీధుల్లోకి వచ్చి డప్పులు వాయిస్తూ, రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేసి సంతోషం వ్యక్తం చేశారు. పులివెందుల వాసి మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టనుండడంతో సంతోషంతో పులివెందుల ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. కేక్‌లు, మిఠాయిలు ఒకరినొకరు తినిపించుకుంటూ తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు.