రాష్ట్రీయం

ఎమ్మెల్సీగా గుత్తా ఏకగ్రీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: ఎమ్యెల్యేల కోటా నుంచి ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆయనకు శాసనసభ కార్యదర్శి వేదాంతం నరసింహాచార్యులు విజయపత్రాన్ని అందజేశారు. మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గుత్తా కృతజ్ఞతలు తెలిపారు. తన విజయానికి కృషి చేసిన టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. రైతుపక్షపాతిగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేరు తెచ్చుకుందన్నారు. గుత్తా విజయపత్రాన్ని స్వీకరించే కార్యక్రమానికి మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్ హాజరయ్యారు.