రాష్ట్రీయం

టీఆర్‌ఎస్‌కు ఇక నిద్రలేని రాత్రులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఇకపై తరుచూ రాష్ట్రానికి రానుండటంతో టీఆర్‌ఎస్‌కు నిద్రలేని రాత్రులేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు’అన మండిపడ్డారు. కేటీఆర్ మాటలు వింటుంటే గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించిన చందంగా ఉందని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్ ఒప్పందాలపై పెడుతున్న ఖర్చులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ చరిత్ర సృష్టించబోతుందన్నారు. అప్పుడు టీఆర్‌ఎస్ నేతలు మెక్కినదంతా కక్కిస్తామని హెచ్చరించారు. నడ్డా ఎవరో తెలియదంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. కేటీఆర్ పుట్టకముందే నడ్డా రాజకీయాల్లో ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో బీజేపీ ఎక్కడుందంటున్న కేటీఆర్, తన చెల్లి కవితను అడిగితే చెబుతుందని లక్ష్మణ్ ఏద్దేవా చేశారు. ఇలా ఉండగా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సోమవారం ఉదయం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. బాగ్‌లింగంపల్లిలో ఇంటింటికి తిరిగి పార్టీ సభ్యత్వాలు తీసుకున్న వారికి నడ్డా పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు.

చిత్రం...బాగ్‌లింగం పల్లిలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా