ఆంధ్రప్రదేశ్‌

తొడపాశం పెట్టి బుజ్జగిస్తున్న బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, సెప్టెంబర్ 15: పిల్లలు ఏడ్చేలా తొడపాశంపెట్టి ఆపై బుజ్జగించిన చందంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్.తులసిరెడ్డి విమర్శించారు. కడప నగరంలో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కడప జిల్లాకు, రాయలసీమకు, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందన్నారు. పైగా బీజేపీ నేతలతో తాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చిలకపలుకులు పలికిస్తోందని ఆయన విమర్శించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చనంతవరకు బీజేపీ నాయకులు రాష్ట్ర ద్రోహులేనని అన్నారు. విభజనచట్టంలో ఉన్న కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేయకుండా మరోవైపు రాయలసీమను అభివృద్ధి చేస్తామని, రాయలసీమ ప్రాజెక్టులకు 210 టీఎంసీల నీరు కావాలని మొసలికన్నీరు కార్చడం సబబుకాదన్నారు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయని ఆయన అన్నారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్యాకేజీ ప్రకటించాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.